*సిస్టర్ నివేదిత*
*పేరు మరియు జననం:*
*సిస్టర్ నివేదిత,*
*”అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్”*, *1867 అక్టోబర్ 28న ఐర్లాండ్లోని కౌంటీ టైరోన్లోని డంగనన్లో జన్మించారు. “నివేదిత”*
*అనే పేరు (అర్థం: దేవునికి అంకితమైనవారు) స్వామి వివేకానంద ఆమెకు 1898లో బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సందర్భంలో ఇచ్చారు.*
*కుటుంబం*
*తల్లిదండ్రులు: తండ్రి శామ్యూల్ రిచ్మండ్ నోబుల్, మెథడిస్ట్ ప్రొటెస్టంట్ మత గురువు మరియు సామాజిక సేవకుడు; తల్లి మేరీ ఇసబెల్ నోబుల్.*
*కుటుంబం స్కాటిష్ వంశానికి చెందినది, ఐదు శతాబ్దాల క్రితం ఐర్లాండ్లో స్థిరపడింది.*
*బాల్యం:*
*మార్గరెట్ ఆరుగురు సోదరీసోదరులలో ఒకరు. తండ్రి సేవా సిద్ధాంతం (“సేవ ద్వారా దేవుని ఆరాధన”) ఆమె ఆలోచనలను బాగా ప్రభావితం చేసింది. 1877లో ఆమె 10 ఏళ్ల వయస్సులో తండ్రి మరణించారు, ఇది ఆమె జీవితంలో భావోద్వేగ ప్రభావం చూపింది.*
*ఆధ్యాత్మిక అన్వేషణ:*
*యవ్వనంలో ఒక వెల్ష్ యువకుడితో ప్రేమ సంబంధం విఫలమైంది, ఇది ఆమెను మానసికంగా కృంగదీసింది. అదే సమయంలో, క్రైస్తవ మతంలోని సంప్రదాయ బోధనలపై అసంతృప్తి ఆమెను కొత్త ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది.*
*విద్య మరియు వృత్తివిద్య:*
*మార్గరెట్ హాలిఫాక్స్ కళాశాలలో చదివారు, ఇక్కడ భౌతిక శాస్త్రం, సంగీతం, కళలు, సాహిత్యం వంటి విషయాలను అభ్యసించారు. ఆమె విద్యా విధానంలో స్వీయ-అభ్యాసం మరియు సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చారు.*
*వృత్తి:*
*1884లో, 17 ఏళ్ల వయస్సులో, కెస్విక్లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తిని ప్రారంభించారు.*
*1886-1889 మధ్య రగ్బీ, వ్రెక్స్హామ్, చెస్టర్లలోని పాఠశాలల్లో పనిచేశారు.జోహాన్ హెన్రిచ్ పెస్టాలోజ్జి మరియు ఫ్రీడ్రిచ్ ఫ్రోబెల్ లాంటి విద్యావేత్తల ప్రగతిశీల విధానాల నుండి స్ఫూర్తి పొందారు, ఇవి బాలల సహజ సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాయి.*
*1892లో వింబుల్డన్లో కింగ్స్లీగేట్ పాఠశాలను స్థాపించారు, ఇది ఆమె విద్యాదర్శనాన్ని ప్రతిబింబిస్తుంది.*
*ఆధ్యాత్మిక అసంతృప్తి:*
*ఉపాధ్యాయురాలిగా విజయవంతమైనప్పటికీ, క్రైస్తవ మతం ఆమె ఆధ్యాత్మిక ఆకాంక్షలను తీర్చలేకపోయింది, దీనివల్ల ఆమె ఇతర తాత్విక మార్గాలను అన్వేషించారు.*
*”స్వామి వివేకానందతో మొదటి సమావేశం” (1895):*
*1895 నవంబర్ 10న లండన్లో 63 సెయింట్ జార్జ్స్ రోడ్లో లేడీ ఇసబెల్ మార్గెసన్ నివాసంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి హాజరయ్యారు.*
*ఆయన వేదాంత దర్శనం, హిందూ తాత్వికత, మరియు “మానవ సేవే మాధవ సేవ” అనే సిద్ధాంతం ఆమెను లోతుగా ఆకర్షించాయి.*
*నిరంతర సంపర్కం:*
*1895-1896 మధ్య స్వామిజీతో అనేక చర్చల్లో పాల్గొన్నారు, ఇవి ఆమె జీవిత దిశను మార్చాయి. వివేకానంద ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించి, భారతదేశంలో సేవ చేయమని ప్రోత్సహించారు.*
*భారతదేశానికి రాక (1898):*
*1898 జనవరి 28న కలకత్తాకు చేరుకున్నారు. మార్చి 25న బెలూర్ మఠంలో బ్రహ్మచర్య వ్రతం స్వీకరించి, స్వామి వివేకానంద “నివేదిత” అనే పేరు ఇచ్చారు. ఆమె హిందూ మతాన్ని అంగీకరించిన తొలి పాశ్చాత్య మహిళగా చరిత్రలో నిలిచారు.*
*శారదా దేవితో సంబంధం:*
*1898 మార్చి 17న శారదా దేవిని కలిసి, ఆమెను “ఖూకి” (చిన్న అమ్మాయి) అని పిలిచారు. శారదా దేవి ఆమెకు తల్లిలాంటి మార్గదర్శనం అందించారు.*
*భారతదేశంలో కృషి:*
*సిస్టర్ నివేదిత కలకత్తాలో స్థిరపడి, భారతీయ సంస్కృతిని పూర్తిగా స్వీకరించారు. ఆమె జీవితం విద్య, సామాజిక సేవ, స్వాతంత్ర్య ఉద్యమం, సాంస్కృతిక జాగృతి, మరియు వైజ్ఞానిక పరిశోధనలలో నిమగ్నమైంది.*
*భారతీయ విద్యార్థుల విద్య కోసం:*
*సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్ (1898):1898 నవంబర్ 13న కలకత్తాలోని బాగ్బజార్లో 16 బోసెపారా లేన్లో బాలికల పాఠశాలను స్థాపించారు.
*శారదా దేవి ఈ పాఠశాలను ఉద్ఘాటించారు.ఈ పాఠశాల బాలికలకు ఆధునిక విద్య (సైన్స్, సాహిత్యం)తో పాటు భారతీయ విలువలు (సంస్కృతి, ధర్మం) బోధించింది.*
*సీవింగ్, హైజీన్, నర్సింగ్ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా నేర్పించారు.ఈ పాఠశాల మహిళల సాధికారతకు బీజం వేసింది, ఇది ఆ కాలంలో విప్లవాత్మకమైన చర్య.*
*ప్రపంచ వేదిక:*
*1899లో అమెరికాకు వెళ్లి, న్యూయార్క్, షికాగోలలో భారతీయ విద్యా విధానాలు, సంస్కృతిపై ఉపన్యాసాలు ఇచ్చారు.*
*ఈ ఉపన్యాసాలు భారతదేశంపై పాశ్చాత్య ఆసక్తిని పెంచాయి.*
*సామాజిక సేవ:*
*ప్లేగ్ సేవలు (1899):*
*1899లో కలకత్తాలో ప్లేగ్ వ్యాధి విజృంభించినప్పుడు, నివేదిత స్వయంగా రోగులను సంరక్షించారు, వీధులను శుభ్రం చేశారు, మరియు పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఆంగ్ల పత్రికల ద్వారా సహాయం కోసం అప్పీల్ చేసి, స్థానిక యువతను సేవలో పాల్గొనేలా ప్రోత్సహించారు.*
*పేదల సేవ:*
*అట్టడుగు వర్గాలకు ఆహారం, వస్త్రాలు, వైద్య సహాయం అందించారు. మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడారు, వితంతువులు మరియు నిరాదరణకు గురైన మహిళల సాధికారతకు కృషి చేశారు.*
*విపత్తు సహాయం:*
*1897లో బెంగాల్ కరువు మరియు 1905లో తూర్పు బెంగాల్ విభజన సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.*
*స్వాతంత్ర్య ఉద్యమంయువత జాగృతి:*
*స్వామి వివేకానంద మరణం (1902) తర్వాత, నివేదిత స్వాతంత్ర్య ఉద్యమంలో యువతను ఉత్తేజపరిచేందుకు సమావేశాలు, ఉపన్యాసాలు నిర్వహించారు.”స్వదేశీ” ఉద్యమాన్ని ప్రోత్సహించి, భారతీయ వస్తువుల వాడకాన్ని ప్రచారం చేశారు.*
*విప్లవకారులతో సహకారం:*
*అనుశీలన్ సమితి వంటి రహస్య సంస్థలకు మద్దతు ఇచ్చారు. అరవింద ఘోష్, బరీంద్ర ఘోష్ వంటి విప్లవకారులతో సన్నిహితంగా పనిచేశారు.*
*1902లో మహాత్మా గాంధీని కలిసి, ఆయన స్వాతంత్ర్య ఆలోచనలను ప్రశంసించారు.1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపైన నిఘా పెట్టింది.*
*జాతీయ గీతం రూపకల్పన:*
*ఆమె “థండర్బోల్ట్” చిహ్నంతో ఒక జాతీయ జెండాను రూపొందించారు, ఇది స్వాతంత్ర్య సంకల్పాన్ని సూచిస్తుంది.*
*పత్రికా సంపాదకత్వం:*
*”కర్మ యోగిన్” పత్రికకు సంపాదకత్వం వహించి, స్వాతంత్ర్య ఆలోచనలను ప్రచారం చేశారు.*
*సాంస్కృతిక జాగృతిభారతీయ సంస్కృతి ప్రచారం:*
*పాశ్చాత్య దేశాలలో భారతీయ కళలు, సాహిత్యం, ధర్మం ఔన్నత్యాన్ని చాటారు. 1899లో అమెరికా, ఇంగ్లాండ్లో ఇచ్చిన ఉపన్యాసాలు భారత సంస్కృతిని ప్రపంచ వేదికపై పరిచయం చేశాయి.రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ వంటి కళాకారులను ప్రోత్సహించారు. భారత మాత చిత్రానికి స్ఫూర్తిగా నిలిచారు.*
*ఐక్యత కార్యక్రమాలు:*
*హిందువులలో అనేక సముదాయాల మధ్య సామరస్యం కోసం కార్యక్రమాలు నిర్వహించారు, జాతీయ ఐక్యతను బలోపేతం చేశారు.*
*రచనలు:*
*ఆమె రచనలు భారత సంస్కృతిని పాశ్చాత్యులకు అర్థమయ్యేలా వివరించాయి:*
*The Web of Indian Life (1904):*
*భారతీయ సమాజం, స్త్రీల జీవన విధానం, సంస్కృతి గురించి వివరించింది.*
*Kali the Mother (1900):*
*హిందూ ఆధ్యాత్మికత, శక్తి ఆరాధనను వివరించింది.*
*The Master as I Saw Him (1910):*
*స్వామి వివేకానంద జీవితం, బోధనల గురించి రాసిన గ్రంథం.*
*Cradle Tales of Hinduism (1907):*
*హిందూ పురాణ కథల సంకలనం, ఇది పాశ్చాత్య పాఠకులకు హిందూ ధర్మాన్ని సులభంగా అర్థమయ్యేలా చేసింది.*
*Notes of Some Wanderings with the Swami Vivekananda (1913):*
*వివేకానందతో కలిసి చేసిన ప్రయాణాల వివరణ.*
*Studies from an Eastern Home (1913):*
*భారతీయ జీవన విధానం గురించి వ్యాసాలు.*
*వైజ్ఞానిక పరిశోధన జగదీశ్ చంద్ర బోస్ సహకారం:*
*నివేదిత జగదీశ్ చంద్ర బోస్ శాస్త్రీయ పరిశోధనలకు సహాయం చేశారు, ఆయన రచనలను సంపాదన చేశారు, మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలతో సంప్రదింపులు ఏర్పాటు చేశారు.*
*టాటా సహకారం:*
*జమ్షెడ్జీ టాటాను వైజ్ఞానిక సంస్థల స్థాపనకు ప్రోత్సహించారు, ఇది తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ఏర్పాటుకు దారితీసింది.*
*సవాళ్లువిదేశీ మహిళగా సవాళ్లు:*
*భారత సమాజంలో ఒక పాశ్చాత్య మహిళగా, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను ఎదుర్కొన్నారు.*
*బ్రిటిష్ ప్రభుత్వం ఆమె స్వాతంత్ర్య కార్యకలాపాల వల్ల నిఘా పెట్టింది.*
*ఆరోగ్య సమస్యలు:*
*1900ల చివరలో ఆమె ఆరోగ్యం క్షీణించినప్పటికీ, సేవా కార్యక్రమాలను ఆపలేదు.*
*మలేరియా, ఇతర అనారోగ్యాలతో బాధపడ్డారు.*
*ఆర్థిక సమస్యలు:*
*పాఠశాల నిర్వహణ, సామాజిక కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.*
*మరణం మరియు వారసత్వం:*
*1911 అక్టోబర్ 13న డార్జిలింగ్లో 43 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మరణించారు.*
*”ఆమె సమాధిపై ఎపిటాఫ్”:*
*”Here lies Sister Nivedita who gave her all to India”*
*(ఇక్కడ సిస్టర్ నివేదిత నిద్రిస్తున్నారు, ఆమె భారతదేశానికి తన సర్వం అంకితం చేశారు)*.
*వారసత్వం:*
సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్ రామకృష్ణ శారదా మిషన్ నిర్వహణలో 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతోంది.*
*స్వాతంత్ర్య ఉద్యమం:*
*ఆమె యువతలో జాగృతి, స్వదేశీ ఉద్యమంలో పాత్ర భారత స్వాతంత్ర్యానికి బలం చేకూర్చాయి.*
*సాంస్కృతిక పునరుజ్జీవనం:*
*ఆమె రచనలు, ఉపన్యాసాలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి.*
*స్మారకాలు:*
*1968లో భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.దక్షిణేశ్వర్ సమీపంలో “నివేదిత బ్రిడ్జ్” ఆమె పేరిట ఉంది.బరానగర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో “నివేదిత భవన్” స్థాపించబడింది.*
*చెన్నైలో సిస్టర్ నివేదిత అకాడమీ ఆమె స్ఫూర్తితో నడుస్తోంది.*
*సిస్టర్ నివేదిత ప్రభావం మహిళల సాధికారత: ఆమె పాఠశాల మరియు సామాజిక కార్యక్రమాలు మహిళల విద్య, స్వావలంబనకు బాటలు వేశాయి.*
*స్వాతంత్ర్య స్ఫూర్తి: యువతలో జాతీయ భావాన్ని రగిలించి, స్వాతంత్ర్య ఉద్యమానికి ఊతం ఇచ్చారు.సాంస్కృతిక వారధి: భారతీయ సంస్కృతిని పాశ్చాత్య ప్రపంచానికి, పాశ్చాత్య ఆధునికతను భారతీయులకు అందించారు.*
*వైజ్ఞానిక పురోగతి:*
*బోస్, టాటా వంటి వారితో సహకారం భారత వైజ్ఞానిక రంగాన్ని బలోపేతం చేసింది.*
*స్ఫూర్తిదాయక జీవితం: ఆమె త్యాగం, అంకితభావం ఈ రోజు కూడా యువతకు స్ఫూర్తినిస్తాయి.*
*సిస్టర్ నివేదిత ఒక ఐరిష్ మహిళగా భారతదేశానికి వచ్చి, స్వామి వివేకానంద స్ఫూర్తితో తన జీవితాన్ని భారత సేవకు అంకితం చేశారు. ఆమె విద్య, సామాజిక సేవ, స్వాతంత్ర్య ఉద్యమం, సాంస్కృతిక జాగృతి, వైజ్ఞానిక పరిశోధనలలో చేసిన కృషి భారత సమాజంలో ఆధునిక ఆలోచనలకు బీజం వేసింది. ఆమె జీవితం సేవ, త్యాగం, జాతీయ భావంతో నడిచిన ఒక అసాధారణ యాత్ర, ఇది ఈ రోజు కూడా యువతకు స్ఫూర్తినిస్తుంది.*
Month: May 2025
ప్రవచన కర్తల్లారా!
గుండె కావాలి ప్రేమ హుండీ!
ప్రవచనాలు పలకండి!
ప్రచండ వాగ్భుషితుల్లారా!
నిత్య
ప్రవచన కర్తల్లారా!
అలుపు లేక పలకండి!
ఆకాశం ప్రతి ధ్వనించేలా!
ఎలుగెత్తి ప్రవచించండి!
నేటి యువతకు
నర నరాన నింపండి!
మనకు కాపలా!
మన ప్రాణాలకు దాపలా!
వారేనని!
అవతారలెత్తి ఆదుకునేవారు!
ఆ దేవదేవుల్లో,
ఆది దేవతలో కాదని!
ఆపత్ భాంధవులు!
ఆపత్కాల బంధువులు!
ఆపద మన దరి చేరనివ్వని,
సరిహద్దు సైనికులని!
వారే నిజ దైవాలని!
గొంతు చించుకు చెప్పండి!
వారి త్యాగాలకు వంత పలకండి!
శిల కొలువైన గుడి లో కాదు!
వీలయితే!
ప్రతి ఇంటి గడపలో!
వారికోసం!
గుండె నిండా ప్రేమతో!
ఓ హుండీ పెట్టమనండి!
పది రూపాయలైనా!
పదిలంగా దాచమనండి!
ఆత్మీయంగా మూటగట్టి పట్టుకెళ్లమనండి!
మన కోసం అమరులైన!
వారింట పొంగే కన్నీటిని
తుడవ మనండి!
మాకోసం మీరైతే,
మీకోసం మేమని భరోషా,
ఇవ్వమనండి!
ఓ సరస్వతిపుత్రులారా!
సత్యానువర్తుల్లారా!
పురాణోపాషకుల్లారా!
చెప్పండి చెప్పండి!
ప్రవచనం హోరుగా!
ప్రవచించండి జోరుగా!
మీ తీరుగా!
మాతృ భూమికోసం!
మరు భూమిని ముద్దాడే,
ధైర్యం వారిదేనని!
ప్రతి పౌరునికి ఇదే విధిగా!
బోధించండి!
ఓ కర్తవ్య దీక్షగా!
కంకణం ధరించమనండి!
శిల కోసం కాదు నిత్య ప్రార్ధన!
ఇల నీకోసం, దేశం కోసం, నేలకొరిగిన వాని కోసం!
ప్రాణాన్ని తృణ ప్రాయంగా!
త్యజించిన వాని కోసం!
ఆలపించమనండి!
నిత్య అష్టోత్తరం!

అనగనగా ఒక రాజు!….?
🔹🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹
*అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు*
రాజు గారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే..మనిషి జీవితాన్ని కొనసాగించడం, జీవితమే ఒక వేట, వేటే ఒక జీవితం
రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1. కామ
2. క్రోధ
3. లోభ
4. మోహ
5. మద
6. మాత్సర్యాలు
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు..
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.అందుకే కథలో ఆరు చేపలను ఎండ గట్టినట్టు చెప్పారు.రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.ఏమిటా చేప.?
*అది మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు*
మనస్సు అంటే ఏమిటి..?మనస్సు అంటే
సంకల్ప వికల్పాలు.ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..?
గడ్డిమేటు. గడ్డిమేటు అంటే ఏమిటి.? కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా.? మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు.జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే.
ఆ కుప్ప తరిగేది కాదు., తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి
ఆవు వచ్చి మేయాలి.ఆవు ఎక్కడనుంచి రావాలి.?
అసలు. ఆవు అంటే ఏమిటి.? ఆవు అంటే
*జ్ఞానం*
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే..
అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ, జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు.
_(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)_
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

ఈ గోవును ఎవరు మేపాలి.?గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు..?సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.ఓ జగన్మాతా.. ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?వాడికి చీమ కుట్టింది.
ఎక్కడిది చీమ.?దానికి ఇంకో పేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేశాడా..?లేదు… అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే..
సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట.?
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే
మన పెద్దలు మన బాల్యంలోనే..ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*