ఈ జీవుడు ఎవరు?

జీవుడు మనసును
ఆధారం చేసుకుని ఇంద్రియాల ద్వారా సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు

ఈ సుఖదుఃఖాలు పాప పుణ్యాల వల్ల లభిస్తాయి

పాపపుణ్యాలు తాను చేసుకున్న కర్మల వల్ల లభిస్తాయి

కర్మలు రాగద్వేషాల వల్ల మొదలవుతాయి

రాగా ద్వేషాలు తినే ఆహారం వల్ల మొదలవుతాయి

1 జీవుడు ఎవరు?

ఆత్మ శక్తి + అహంకారం + మనస్సు + ప్రాణం = జీవుడు

ఆత్మ సాక్షి (చూడేవాడు)

అహంకారం “నేనే చేస్తున్నాను” అనే భావం
మనస్సు అనుభవించే పరికరం
ఇంద్రియాలు అనుభవ మార్గాలు
ఆత్మ శుద్ధం – సుఖదుఃఖాలు జీవుడికే

2  మనస్సే ఆధారం ఎందుకు?

“మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః”
(మనస్సే బంధానికీ, మోక్షానికీ కారణం) ఎందుకు?

ఇంద్రియాలు జడమైనవి
వాటికి అర్థం ఇచ్చేది మనస్సే

మనస్సు లేనిదే

చూపు లేదు,
వినికిడి లేదు
రుచి లేదు
సువాసన లేదు
స్పర్శ సుఖం లేదు
కాబట్టి  మనస్సు వల్లనే ఇంద్రియాల  అనుభవం కలుగుతుంది

3  సుఖదుఃఖాలు ఎలా పుడతాయి?

విషయం  ఇంద్రియం  మనస్సు  బుద్ధి  అహంకారం  అనుభవం

ఇష్టమైతే  సుఖం  ఇష్టం కాకపోతే  దుఃఖం

4  పాప–పుణ్యాల పాత్ర

పుణ్యం వల్ల సుఖానుభవాలు
ఆరోగ్యం
సుఖ కుటుంబం
ప్రశాంత మనస్సు

పాపం వల్ల దుఃఖం
రోగం
అపమానం
భయం, కలత
ఇవి కర్మ ఫలాలు

5  పాపపుణ్యాలు ఎలా ఏర్పడతాయి?

కాయం (శరీరం)
వాక్ (మాట)
మనసు (ఆలోచన)

ఈ మూడు ద్వారాల్లో
స్వార్థం, హింస, అజ్ఞానం  పాపం
కరుణ, ధర్మం, సత్యం  పుణ్యం

6  కర్మ చక్రం

కర్మ,  పాప పుణ్యం  సుఖ దుఃఖం 
వాసనలు  మళ్లీ కర్మ ఇదే సంసార చక్రం

7   సత్యం

ఈ సుఖదుఃఖాలను అనుభవిస్తున్నవాడు ఎవరు?

జీవుడు

కానీ జీవుడికి అసలు స్వరూపం ఏమిటి?

ఆత్మ
కర్మ చేయదు
పాపపుణ్యాలు కలగవు
సుఖదుఃఖాలు అనుభవించదు

8  మోక్షానికి మార్గం

కర్మను ఆపడం కాదు
కర్తత్వ భావాన్ని వదలడమే

“నేను చేస్తున్నాను”  బంధం
“ఇవి ప్రకృతిలో జరుగుతున్నవి”  విముక్తి

9  మూడు వాక్యాల సారాంశం (మహా సూత్రం)

జీవుడు

మనస్సును ఆధారం చేసుకుని
ఇంద్రియాల ద్వారా
పాపపుణ్య ఫలితంగా
సుఖదుఃఖాలను అనుభవిస్తూ
సంసారంలో తిరుగుతున్నాడు

కానీ

తాను జీవుడు కాదని తెలుసుకున్న రోజు
సంసారం అక్కడితో ముగుస్తుంది.

Mottobyte Digital Marketing

8520986185

ఇదే కదా మందంటే?

*‼️ ఔషధాలు లేని జీవితం‼️*  *1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం. *2.* ఓం జపించడం ఔషధం. *3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం. *4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం. *5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. *6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం. *7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే. *8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. *9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే. *10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం. *11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం. *12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. *13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం. *14.* నవ్వు మరియు జోకులు ఔషధం. *15.* సంతృప్తి కూడా ఔషధం. *16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం. *17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం. *18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. *19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే. *20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం. *21.* అందరితో కలిసి జీవించడం ఔషధం. *22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే. *23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. *24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం. *25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. *26.* *చివరగా…* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.  🪷 ప్రకృతి యొక్క *”గొప్పతనం”* ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.  *ఈ  ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*

ఆలోచించండి 💝🙏

Mottobyte Digital Marketing

8520986185

బంగారం తవ్వొద్దు?

👇ఒకరు బంగారం తవ్వాడు, మరొకరు పారలు అమ్మాడు, మూడోవాడు భోజనం బిజినెస్ పెట్టాడు; వారిలో ఎవరు తెలివైన వ్యాపారో, ఎవరు గెలిచారో తెలుసుకోండి👇

ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో బంగారం దొరుకుతోందని వార్త వ్యాపించింది. వెంటనే ముగ్గురు స్నేహితులు, అర్జున్, భాస్కర్, చేతన్, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడికి వెళ్లారు.

అర్జున్ బలమైన, సాహసోపేతుడు. “నేను నా చేతులతో బంగారం తవ్వి ధనవంతుడిని అవుతా” అని ప్రకటించాడు. ఒక పార తీసుకుని రోజూ రాత్రింబవళ్ళు తవ్వడం మొదలుపెట్టాడు.

కొన్నిసార్లు అతనికి మంచి ముక్కలు దొరికేవి, మరికొన్నిసార్లు రోజుల తరబడి ఏమీ దొరికేది కాదు. అతని ఆదాయం పూర్తిగా అదృష్టం, ఆ రోజు చేసే కష్టంపైనే ఆధారపడి ఉండేది.

భాస్కర్ మాత్రం లెక్కపెట్టేవాడు. “అందరూ బంగారం కోసం తవ్వుతుంటే, వీళ్లకు కావాల్సిన పనిముట్లు అమ్మితే రిస్క్ తక్కువ” అని ఆలోచించాడు.

అతను చిన్న దుకాణం పెట్టి పికాక్స్‌లు, పారలు, మ్యాప్‌లు అమ్మడం ప్రారంభించాడు. కొత్త కార్మికులెవరైనా వచ్చినా అతడే వాళ్ల మొదటి నిలయం. అతనికి స్థిరమైన ఆదాయం రావడం మొదలైంది.

చేతన్ అయితే మరింత లోతుగా ఆలోచించాడు. “బంగారమో, పనిముట్లో కాదు… ఇక్కడ అసలైన సమస్య ఆకలి మరియు వసతి” అని గుర్తించాడు. అందుకే చిన్న భోజనశాలను, కొన్ని గుడారాలను ఏర్పాటు చేసి, కార్మికులకు మంచి భోజనం, విశ్రాంతి ఇవ్వడం మొదలుపెట్టాడు.

కొన్ని నెలల తర్వాత పర్వతం పైభాగంలో దొరికే బంగారం పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు లోతుగా తవ్వాలి, అంటే ఎంతో శ్రమ, తక్కువ లాభం.

అర్జున్ లాంటి వందల మంది కార్మికులు బంగారం దొరకక నిస్సహాయంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అతని ఆదాయం ఒక్కరోజులోనే ఆగిపోయింది.

కొత్త కార్మికులు రావడం ఆగిపోవడంతో భాస్కర్ దుకాణంలో పనిముట్లు కొనేవారే లేకపోయారు. అతని వ్యాపారం కూడా కుంగిపోయింది
కానీ చేతన్ భోజనశాల మాత్రం రద్దీగానే ఉండిపోయింది.

బంగారం దొరికినా, దొరక్కపోయినా, మిగిలిపోయిన కార్మికులకు, వ్యాపారులకు భోజనం మాత్రం కావాలి. చేతన్ వ్యాపారం బంగారం మీద ఆధారపడలేదు; ఆ ప్రాంతం మీద ఆధారపడింది. అందుకే అతడే చివరికి అత్యంత విజయవంతమైన వ్యాపారి అయ్యాడు.

వ్యాపారంలో మార్గాలు మూడు:

  1. మీరు బంగారం కోసం తవ్వొచ్చు:- ఎక్కువ రిస్క్, పెద్ద ఆశలు.
  2. మీరు పనిముట్లు అమ్మొచ్చు:- ఆ పరిశ్రమకు మద్దతుగా ఉండే వ్యాపారం.
  3. లేదా మీరు భోజనశాల నడుపొచ్చు:- ఆ పర్యావరణ వ్యవస్థకు అవసరమైన సేవను అందించే వ్యాపారం.

ఒక రోజు బంగారం కోసం పరుగెత్తిన వారు కనుమరుగవుతారు.
పారలు కొనేవాళ్లు కూడా తగ్గిపోతారు. కానీ ఒక్క గంటైనా ఊరట ఇచ్చిన చోటుకు మాత్రం మనుషులు తిరిగి రావడం ఆపరు.

వ్యాపారం అంటే మీరు ఏమి అమ్ముతున్నారన్నది కాదు, మీ వల్ల వారి రోజు ఎంత సులభమవుతుందో, వారు మీ మీద పెట్టే నమ్మకం ఎంత లోతుగా ఉందో అది.

ఆ నమ్మకం ఒకసారి కస్టమర్ హృదయంలో పెరిగితే, అదృష్టం తగ్గినా వ్యాపారం తగ్గదు. మీరు అమ్మే వస్తువు కాకుండా, మీరు పరిష్కరిస్తున్న సమస్యే, మీ నిజమైన సంపద అవుతుంది.

ట్రెండ్ మారినా, మార్కెట్ చల్లబడినా, అదే మిమ్మల్ని నిలబెడుతుంది, అది బంగారం కంటే బలమైన బలం.
🙏🙏🙏

నాన్న చెప్పిన పాఠం
……………………….


పోటీ పరీక్షల్లో ఓడిపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళబోతున్న తన కుమారుడికి, ఓ తండ్రి చెప్పిన జీవిత సత్యం.

“జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ వంటిదే నాన్నా! ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాడు. ఒక్కోసారి మనం పడిపోవచ్చు. పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు నాన్నా! ఇంకా మనకు అవకాశం ఉంటుంది. మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా, రెఫరీ ప్రకటించడు. మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు. పది వరకు అంకెలు లెక్కబెడతాడు. అప్పటికీ లేవలేకపోతే, అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు.

జీవితంలో కూడా అంతే! మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము. సమస్య రాగానే, ఓడిపోయామని కృంగిపోకూడదు. భగవంతుడు సమయం ఇస్తాడు. పది వరకు లెక్కబెడతాడు. నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి, గెలుస్తాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి.

అది కూడా ఓకే. ఒక్కోసారి ఓడి పోతాం. ఫర్వాలేదు. ఇంకో పోటీ, ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.

చాలా మంది ‘కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడి లేచినందుకు!’ అని అంటుంటారు. కానీ, పడిన కెరటం, లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు. విరిగి పడిన కెరటం ఛిద్రమై, పతనమై మామూలు నీటిలో కలిసిపోతుంది, అస్థిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం.

కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని, దిశను ఎన్నుకుని, మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని, తీరాన్ని మహోద్ధృతంగా చేరుకుంటుంది. అది కొత్త కెరటం. దాని శక్తి అనంతం.

మనిషి కూడా అంతే నాన్నా! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా, నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి. ఈ తరం యువతీయువకులకు ఆ సామర్థ్యం ఉంది.”

కుమారుడు కన్నీళ్ళమయమయి, జెండా కర్రలా లేచి నిలబడి తండ్రిని కౌగలించుకుని,

“ఔను నాన్నా! నేను మళ్ళీ ప్రయత్నిస్తాను” అని అన్నాడు.

… ఈ కథ ద్వారా మనకు ఒక మంచి విషయం అర్థమైంది.🫟🫟🫟🫟💥💥💥💥

ప్రవచన కర్తల్లారా!

గుండె కావాలి ప్రేమ హుండీ!

ప్రవచనాలు పలకండి!
ప్రచండ వాగ్భుషితుల్లారా!
నిత్య
ప్రవచన కర్తల్లారా!

అలుపు లేక పలకండి!
ఆకాశం ప్రతి ధ్వనించేలా!
ఎలుగెత్తి ప్రవచించండి!

నేటి యువతకు
నర నరాన నింపండి!
మనకు కాపలా!
మన ప్రాణాలకు దాపలా!
వారేనని!

అవతారలెత్తి ఆదుకునేవారు!
ఆ దేవదేవుల్లో,
ఆది దేవతలో కాదని!

ఆపత్ భాంధవులు!
ఆపత్కాల బంధువులు!
ఆపద మన దరి చేరనివ్వని,
సరిహద్దు సైనికులని!
వారే నిజ దైవాలని!

గొంతు చించుకు చెప్పండి!
వారి త్యాగాలకు వంత పలకండి!

శిల కొలువైన గుడి లో కాదు!

వీలయితే!
ప్రతి ఇంటి గడపలో!
వారికోసం!
గుండె నిండా ప్రేమతో!
ఓ హుండీ పెట్టమనండి!

పది రూపాయలైనా!
పదిలంగా దాచమనండి!

ఆత్మీయంగా మూటగట్టి పట్టుకెళ్లమనండి!
మన కోసం అమరులైన!
వారింట పొంగే కన్నీటిని
తుడవ మనండి!

మాకోసం మీరైతే,
మీకోసం మేమని భరోషా,
ఇవ్వమనండి!

ఓ సరస్వతిపుత్రులారా!
సత్యానువర్తుల్లారా!
పురాణోపాషకుల్లారా!

చెప్పండి చెప్పండి!
ప్రవచనం హోరుగా!
ప్రవచించండి జోరుగా!
మీ తీరుగా!

మాతృ భూమికోసం!
మరు భూమిని ముద్దాడే,
ధైర్యం వారిదేనని!

ప్రతి పౌరునికి ఇదే విధిగా!
బోధించండి!
ఓ కర్తవ్య దీక్షగా!
కంకణం ధరించమనండి!

శిల కోసం కాదు నిత్య ప్రార్ధన!

ఇల నీకోసం, దేశం కోసం, నేలకొరిగిన వాని కోసం!

ప్రాణాన్ని తృణ ప్రాయంగా!
త్యజించిన వాని కోసం!

ఆలపించమనండి!
నిత్య అష్టోత్తరం!

అనగనగా ఒక రాజు!….?


🔹🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹


*అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు*

రాజు గారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషి లోని సప్త ధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే..మనిషి జీవితాన్ని కొనసాగించడం, జీవితమే ఒక వేట, వేటే ఒక జీవితం

రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1. కామ
2. క్రోధ
3. లోభ
4. మోహ
5.  మద
6. మాత్సర్యాలు

వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండ గట్టవచ్చు..
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.అందుకే కథలో ఆరు చేపలను ఎండ గట్టినట్టు చెప్పారు.రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.ఏమిటా చేప.?

*అది మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు*

మనస్సు అంటే ఏమిటి..?మనస్సు అంటే
సంకల్ప వికల్పాలు.ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచు కొస్తుంది.మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.

కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు.మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది..?
గడ్డిమేటు. గడ్డిమేటు అంటే ఏమిటి.? కుప్పపోసిన అజ్ఞానం.

గడ్డిమేటులా పేరుకు పోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా.? మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

కానీ అజ్ఞానం అలాంటిది కాదు.జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే.
ఆ కుప్ప తరిగేది కాదు., తగ్గేది కాదు.

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి

ఆవు వచ్చి మేయాలి.ఆవు ఎక్కడనుంచి రావాలి.?
అసలు. ఆవు అంటే ఏమిటి.? ఆవు అంటే
*జ్ఞానం*

జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే..
అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ, జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు.
_(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)_
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధ పురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.



ఈ గోవును ఎవరు మేపాలి.?గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు..?సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞాన రూపంగా మనందరికి ధారపోశాడు.ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.ఓ జగన్మాతా.. ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?వాడికి చీమ కుట్టింది.

ఎక్కడిది చీమ.?దానికి ఇంకో పేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.

మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేశాడా..?లేదు… అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.

చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే..
సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట.?
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే
మన పెద్దలు మన బాల్యంలోనే..ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*

రాఘవ రావు… ఓ ఇల్లు

*కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.

ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపుతో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.*

*మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”*



*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు… “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*

*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు” ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*

*మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు. వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*

*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*

*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది. ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది. ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.*

*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు. వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..! మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*

*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*

*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*

*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు. అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*

*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*

*రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు.*

*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*

*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*

*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*

*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*

*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు. తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*

*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావుల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*

*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*

*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*

*“పైస జారనీకు ప్రాణమున్నంతకు పైస పోయెనేని ప్రాణమాగు పైసలో నగలదు పరమార్ధమంతయు, పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*

*అదీ కథలోని నీతి!*
*విశ్రాంతజీవులందరూ,*
*తస్మాత్ జాగ్రత…*

*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు… చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది…. ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..! ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే…!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి…*

రాఘవ రావు… ఓ ఇల్లు

*కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.

ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపుతో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.*

*మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”*



*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు… “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*

*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు” ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*

*మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు. వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*

*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*

*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది. ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది. ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.*

*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు. వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..! మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*

*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*

*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*

*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు. అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*

*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*

*రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు.*

*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*

*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*

*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*

*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*

*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు. తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*

*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావుల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*

*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*

*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*

*“పైస జారనీకు ప్రాణమున్నంతకు పైస పోయెనేని ప్రాణమాగు పైసలో నగలదు పరమార్ధమంతయు, పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*

*అదీ కథలోని నీతి!*
*విశ్రాంతజీవులందరూ,*
*తస్మాత్ జాగ్రత…*

*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు… చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది…. ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..! ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే…!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి…*

నా కష్టాలు ..ఓ బంగాళాదుంప


🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸


*కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం*

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,
నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? ” అంటూ తన బాధలను చెప్పుకుంటూ
వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.
చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.



గ్యాస్ పొయ్యి మీదున్న – మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),
మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,
ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా – అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక – స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ‘ అలా ఎందుకు చేసాడా పని..’ అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

” ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు  నాన్నా?.. ” అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

” ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,
నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు.. వీటిల్లో – నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. ) గట్టిపడిపోతావా..?  పరిస్థితులను మారుస్తావా…?

ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది..” అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..

” నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్..” కృతజ్ఞతాభావంతో అంది.

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
*స్వస్తి*

Bulk SMS mottobyte

మీకు తెలుసో లేదో?

✍️డబ్బులు వూరికే ఎవ్వరికి రావు


విజయం కూడా ఎవ్వరికీ వూరికే రాదు..


✍️విజయానికి కావాల్సిందేమిటీ…? గొప్ప చదువులా…
అదే అయితే ఆయనకి మనదేశం పేరు రాయడం కూడా సరిగ్గా చేతకాదు. పోనీ తాతలిచ్చిన ఆస్తిపాస్తులా అంటే… ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలో..

✍️మరి అటు చదువూ, ఇటు వారసత్వపు సంపదా ఏదీలేని..  ‘కిరణ్‌కుమార్‌’ పదివేల కోట్లరూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యారూ..? ఆ మాట ఆయన్నే అడిగితే, ఇదిగో ఇలా చెబుతున్నారు…

✍️నేను పుట్టింది నెల్లూరులో. మీకు తెలుసో లేదో… నెల్లూరికి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి మా కుటుంబం
ఎనభై ఏళ్లకిందట రాజస్థాన్‌ నుంచి వచ్చి స్థిరపడింది.

✍️నాన్న మూల్‌చంద్‌ జైన్‌… అమ్మ సుశీలాబాయి. వాళ్లకి తొమ్మిది మంది సంతానం. నేనే చివరి వాణ్ణి. ఆరుగురు అక్కలూ, ఇద్దరు అన్నలు నాకు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్య్రం తప్పలేదు.

✍️నాన్న బంగారు దుకాణాల్లోనూ, బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవాడు.  రోజుకి మూడుపూటలా కాదుకదా ఒక్కపూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది.

✍️నేను చిన్నప్పుడు అందరితోపాటే బడిలో చేరాను కానీ… అదేమిటో నా బుర్రలోకి ఒక్క అక్షరం ముక్క కూడా వెళ్లేది కాదు.

✍️ఎలాగోలా ఐదో తరగతి దాకా నెట్టుకువచ్చినా… ఆ తర్వాత మానేశాను. అందుకనే నాన్న ‘మా ఖర్మకొద్దీ పుట్టావురా నువ్వు…!’’ అని ఎప్పుడూ తిడుతుండేవాడు.

✍️ఇంట్లోని కష్టాల వల్ల కావొచ్చు… తొమ్మిదేళ్లకే నాకు జీవితంపైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో నా ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలీకి వెళుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టాను.

✍️మూడేళ్ల తర్వాతే నెల్లూరులో తయారుచేస్తున్న నగల్ని చెన్నై, కేరళల్లోని దుకాణాలకి హోల్‌సేల్‌గా అమ్ముతారని తెలిసింది. నేనూ అలా అమ్మాలనుకున్నా.

✍️మరి నగల తయారీకి బంగారం కావాలి కదా! మా ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న నాలుగు బంగారు గాజులుండేవి. ఆమెకి చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి… 65 గ్రాముల్లో కొన్ని జుమ్కీలు చేయించాను.

✍️వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. అక్కడ నేను బాగా విన్న దుకాణం పేరు లలితా జ్యువెలరీసే! ఆ దుకాణం ముందు నిల్చున్నాను.

✍️అప్పుడే ఆ సంస్థ ఓనర్‌ కందస్వామి కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి నాకొచ్చిన తెలుగు, హిందీ కలగలిపి ‘మీకోసం నగలు అమ్మడానికి నెల్లూరు నుంచి వచ్చాను’ అని చెప్పాను.

✍️పన్నెండేళ్ల కుర్రాణ్ణి కదా! ఏదో సరదాపడుతున్నానని అనుకున్నాడేమో ‘సరే చూపించు!’ అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుమ్కీలు చూపించాను! రోజూ కిలోల లెక్కన నగలు కొనే
ఆయన… వాటిని చూసి నవ్వేశారు.

✍️అయినా నన్ను నిరుత్సాహపరచకుండా ‘వీటిని నేను టెస్ట్‌ చేయాలి… రేపు రా!’ అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను.

✍️నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ‘ఇంట్లో మిగిలిన చివరి నగలవి… నువ్వే ఆలోచించుకో!’ అని మాత్రమే చెప్పింది.

✍️తర్వాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్‌కి వెళ్లాను. నన్ను చూడగానే… ‘ఇలాంటివే మరిన్ని చేసుకురా!’ అని చెబుతూ… 15 వేల రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామి.

✍️వ్యాపారిగా నా తొలి సంపాదన అది! అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొన్నాను. 24 గంటలపాటు తిండీ, నిద్రలన్నీ మాని ఈసారి వంద గ్రాముల నగలు తయారుచేసుకుని వెళ్లాను.

✍️సాధారణంగా అలా నగలు తయారుచేయడానికి వారం పడుతుంది. నేను రెండోరోజే ఆయన ముందుకి వెళ్లడం చూసి విస్తుపోయారాయన. క్రమంగా 200గ్రా., 300గ్రా., 1000గ్రా… అలా ఆరునెలల్లోనే మూడు కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నాను.

✍️ఆ తర్వాతి నుంచీ పూర్తిగా నా దగ్గరే నగలు కొనడం ప్రారంభించారు. లలితా జ్యువెలరీస్‌తోపాటూ ఇతర పెద్ద దుకాణాలూ ఆర్డర్‌లు ఇచ్చాయి.

✍️దాంతో మొదటి ఏడాదే ఏడు లక్షల రూపాయల వ్యాపారం చేశాను. నేను మేజర్‌ని అయ్యాక అష్రఫ్‌ అనే మిత్రుడి భాగస్వామ్యంతో ‘ఏకే జ్యువెలర్స్‌’ పేరుతో హోల్‌సేల్‌ నగల దుకాణాన్ని రిజిస్టర్‌ చేశాను.

✍️ఎనిమిదేళ్లలో దక్షిణాదిలోనే నంబర్‌ వన్‌ హోల్‌సేల్‌ నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నాను. రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి.

✍️ఆ కఠోర శ్రమే నన్ను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. నా విజయానికి తొలిమెట్టుగా నిలిచిన లక్షణం అదే!

✍️పట్టుదల + సాహసం = కొత్తదనం..

✍️1996 ప్రాంతం… లలితా జ్యువెలరీస్‌ సంస్థ యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోయింది. ‘అప్పులవాళ్ల వల్ల నేను అరెస్టు కావడమో… దుకాణాన్ని మూసేయడమో!’ రెండేదార్లున్నాయి నాకు అని నా ముందు కన్నీరుపెట్టుకున్నారు దాని యజమాని కందస్వామి.

✍️నాకు జీవితాన్నిచ్చిన సంస్థ అలా మునిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోను?! అందువల్ల 1999లో నేనే దాన్ని కొన్నాను. కొన్నానే కానీ… ఆరునెలలపాటు
నాకేమీ అర్థంకాలేదు.

✍️హోల్‌సేల్‌ వ్యాపారిగా గంటకి పది కిలోల నగలు అమ్మే నేను రీటైల్‌లో రోజంతా కష్టపడ్డా కిలో బంగారం నగల్ని అమ్మలేకపోయేవాణ్ణి. నాలుగేళ్లలోనే ‘అసలు ఇటు ఎందుకొచ్చానురా భగవంతుడా!’ అనే పరిస్థితిలో పడ్డాను.

✍️అయినాసరే, వెనక్కి తగ్గాలనుకోలేదు. కొత్తగా ఏమేం చేయొచ్చో ఆలోచించడం మొదలుపెట్టాను. నాణ్యత ఉన్నతంగా ఉండాలని దక్షిణాదిలోనే తొలిసారి బీఐఎస్‌ హాల్‌మార్కు నగల్ని పరిచయం చేశాను.

✍️వాటిని కూడా హోల్‌సేల్‌ ధరలకే అమ్మేవాణ్ణి.
నా లాభాలు తగ్గించుకుని తరుగు తొమ్మిదిశాతం మించకుండా చూసుకున్నాను. ఇవన్నీ
వినియోగదారుల్ని ఆకర్షించాయి. లాభాలు పెరిగాయి.

✍️కానీ, ‘మాకంటే నువ్వు తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదంటూ’ నగల దుకాణాల సంఘాలు నాకు హుకుం జారీ చేశాయి… పట్టించుకోలేదు. పోటీదారులు నేరుగానే నన్ను బెదిరించారు… భయపడలేదు.

✍️నా పని నేను చేసుకుంటూ పోయాను. వాటిని పట్టించుకోని ధైర్యమే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తోంది. అదేలేకుంటే జీవితంలో సవాళ్ళని ఎదుర్కోలేం, కొత్తగా ఏదీ సాధించలేం.

✍️అందుకే మోడల్‌ అయ్యాను….

✍️మొదట్లో లలితా జ్యువెలరీస్‌కి నగలు సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ రెండు రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవాణ్ణి. లక్షలు సంపాదిస్తున్నప్పుడూ అంతే.

‘✍️లలితా జ్యువెలరీస్‌’ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చాను. అక్కడ చెన్నైలోని మా ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవాణ్ని. మాకున్న 21 దుకాణాల్లో ఎక్కడా ఛైర్మన్‌గా నాకంటూ ప్రత్యేక క్యాబిన్‌ ఉండదు.

✍️మిగతా ఉద్యోగులతోపాటు స్టోర్‌లోనే కూర్చుంటాను.
మా సంస్థ ప్రకటనలని స్టార్‌ హీరోల చేత చేయించకపోవడానికీ అదే కారణం. నేనే నటించాలని అనుకున్నాక మేకప్‌లూ, విగ్గులూ వేసుకోమన్నారు చాలామంది.

✍️అది కూడా దండగ ఖర్చు అనిపించే నా గుండుతోనే టీవీల ముందుకు వచ్చేశాను. ఇలాంటివాటికి నిరాడంబరత అనే పెద్ద పదం అక్కర్లేదు… ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచితూచి ఖర్చుపెట్టడం మాత్రమే.

✍️కానీ జీవితంలో నాకంటూ కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది! లలితా జ్యువెలరీస్‌ని కొన్న చాలా ఏళ్ల తర్వాతే నేను కారుకొన్నాను. ఆ రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చాను.

పడుకున్నాక రెండుగంటలకి మెలకువ వచ్చింది. ‘నిజంగానే కారు కొన్నానా… అంత గొప్పవాణ్ణయ్యానా?! కాదు ఇదంతా కలేనేమో!’ అనిపించింది. హడావుడిగా లేచి పార్కింగ్‌కి వెళ్లి కారు డోర్‌ తీసి… హారన్‌ మోగించాక కానీ… నాకు తృప్తిగా అనిపించలేదు.

ఎంతగా ఆచితూచి ఖర్చుపెట్టినా మన కలలని దూరం చేసుకోకూడదనీ, అవే మన జీవితాల్ని ఉత్సాహంతో నింపుతాయనీ ఆ రోజే తెలుసుకున్నాను.

అనుమానంతో కాదు… ప్రేమతో..

చిన్నప్పుడు స్కూల్లోనే కాదు, ఇప్పటికీ నేను ఇంగ్లిషు అక్షరాలని గుర్తుపెట్టుకోలేను. విదేశాలకి వెళుతున్నప్పుడు ఎయిర్‌పోర్టులో దరఖాస్తు నింపాలికదా… అందులో ‘ఇండియన్‌’ అనే పదాన్ని రాయాలన్నా తడబడతాను.

లలితా జ్యువెలరీస్‌ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల సామ్రాజ్యం! అయినా నేను ఇప్పటికీ కరెన్సీ కట్టల్ని
సరిగ్గా లెక్కపెట్టలేను. ఎప్పుడు లెక్కపెట్టినా ఎక్కువో
తక్కువో వస్తుంది.

అయితే లాభనష్టాలని మాత్రం కచ్చితంగా భేరీజు వేయగలను. ఫలానా గంటకి ఇంత బిజినెస్‌ జరుగుతుందని చెప్పగలను. చదువులేని నాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఆ ‘మైండ్‌ కాలిక్యులేషన్‌’ అనిపిస్తుంది.

అంతకన్నా పెద్ద వరం నా ఉద్యోగులు. నెల్లూరులో ఒకప్పుడు నాతో కలిసి పనిచేసినవాళ్లూ, వాళ్ల పిల్లల్లో
90 శాతం మంది ఇప్పటికీ మా దగ్గర పనిచేస్తున్నారు.

నాకు చదువులేకున్నా వాళ్లేం రాస్తున్నారో… ఏ లెక్కలు వేస్తున్నారో అని ఇంకెవరి చేతో తనిఖీ చేయించను. పక్కవారిని అనుమానంతో కాకుండా ప్రేమతో ఆదరిస్తే అద్భుతాలు చేయొచ్చనే విశ్వాసం నా ఉద్యోగుల వల్లే వచ్చింది.

ఉన్నంతలో కొంత….

మేమెక్కడ షోరూమ్‌ తెరిచినా దానికి అనుబంధంగా
ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని వృత్తిపనివాళ్లకి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ రకంగా మా సంస్థలో వేలాదిమంది ఉద్యోగులున్నారు.

మా దుకాణాల్లో పనిచేసేవాళ్లందరికీ మధ్యాహ్నంపూట ఉచితంగా భోజనం పెడతాం. ఇక తనకున్న చిట్టచివరి బంగారు నగలతో నన్ను ఇంతటివాణ్ణి చేసిన అమ్మ గుర్తుగా, ఆమె పెరిగిన రాజస్థాన్‌ బలానా ప్రాంతంలో
పెద్ద బడి కట్టించాను.

వెయ్యిమంది పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చు అక్కడ! వందేళ్లపాటు సున్నం కొట్టాల్సిన అవసరం లేకుండా చలువ రాళ్లతో కట్టించాను.

మనం ఎంత ఎత్తుకి ఎదిగినా దానికి ఏదో రకంగా వనరులని ఇచ్చేది ఈ సమాజమే! దానికి తిరిగి ఇవ్వడంలోని సంతృప్తి చిన్నదేం కాదు!

ఇంతా ఎందుకు చెబుతున్నానంటే….

‘గుండుబాస్‌’, ‘గుండాయన’… నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్నిలాగే గుర్తుపెట్టుకుంటున్నారు.

ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు…
నేనూ వాటిని భలే ఎంజాయ్‌ చేస్తున్నా!

వాటిని తయారుచేసేవాళ్లలో ఎక్కువశాతం యువతేనట. నాపైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నా… యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా!

ఆ కలలు నెరవేరేందుకు ఎంతోకొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా నా జీవితానుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నాను. ‘డబ్బులెవరికీ ఊరికే రావు…’ అంటూ టీవీల్లో కనిపించే నేను ‘విజయం ఎవరికీ ఊరికే రాదు..’ అని యువతకి చెప్పాలనుకుంటున్నా.

అదో కోమాలో ఉంటాను!

నేను ‘లలితా’ సంస్థని కొనడానికి కాస్త ముందే హేమతో పెళ్లైంది. వాళ్లది చెన్నైలో స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలు. భక్తి, భవ్య అని కవలలు.

చిన్నవాడు హీత్‌(దీని అర్థమేంటో వాళ్లమ్మకి మాత్రమే తెలుసు!)కి ఇప్పుడు పందొమ్మిది నెలలు. పిల్లలతో
కలిసి ఏడాదికి రెండుమూడుసార్లయినా విదేశాలకి వెళుతుంటాను. అక్కడికెళ్లినా వ్యాపారం గురించే ఆలోచిస్తుంటాను.

‘మీరు ఎక్కడికొచ్చినా బిజినెస్‌ కోమాలో ఉన్నట్టుంటారు… ’ అని విసుక్కుంటారు నా పిల్లలు.
నేను వదిలించుకోవాలనుకుంటున్న లక్షణం
కృషి పట్టుదలతో పాటు ‘అవసరం’ మనిషిని ముందడుగు వేసేలా చేస్తుంది!
ఏమీ లేని నుంచే … ప్రారంభం … మొదటి మెట్టు!
ఎక్కుతూనే ఉంటారు ఒక్కో మెట్టు …
విజయానికి చివరి మెట్టు ఉండదు!

ఒక రకంగా కూలీ పని చేసే కుటుంబం…
9 మంది సంతానం…
తినడానికి తిండి…
ఉండడానికి సరైన ఇల్లు లేని పేదరికం…
అక్షరాలు కూడా గుర్తు పట్టలేని వ్రాయలేని చదువు…

కానీ… కానీ…
ఆ పేదరికం లోనే…
బాల్యం లోనే నిర్ణయించుకున్న లక్ష్యం….
ఆ లక్ష్యం సాధించడం కోసం నిరంతర శ్రమ…
కొన్ని గంటలు మాత్రమే నిద్ర పోయే కఠోర శ్రమ….
నా ఉద్యోగస్తులను నా కుటుంబంలా చూసుకొనే కొన్ని విలువలు…
నిద్రలో కూడా వ్యాపారం గురించే ఆలోచించే తత్వం…
నిరంతరం ప్రస్తుతం ఉన్న సంస్థలు…
కొత్త వాటిని స్థాపించే ఆలోచనలు…
వాటిలో జరిగే వ్యాపారం.. ఇంకా పెరుగుదల కోసం నిరంతరం అప్రమత్తతతో తీసుకోవలసిన నిర్ణయాల గురించిన ఆలోచనలు…
వీటన్నిటి మధ్య కుటుంబానికి కేటాయించే క్వాలిటీ టైమ్… వర్క్ అండ్ ఫ్యామిలి లైఫ్ బ్యాలెన్స్…
చివరిగా ముఖ్యంగా
నాకు ఇంత ఇచ్చిన సమాజానికి నేనూ ఎంతో కొంత ఇవ్వాలనే తాపత్రయం…
అన్నిటి కన్నా ముఖ్యంగా మానవ విలువలు… సంబంధాలు..
వాటికి నేను ఇచ్చే ప్రాధాన్యత…

పై, నా.. ప్రయాణం చదివారు కదా నేనే ఇన్ని చేయగలిగాను అంటే మీరూ తప్పకుండా ఇంకా చాలా చేయవచ్చు…
క్లారిటీ గా ఉండండి…
లక్ష్యం ఉన్నతంగా ఉంచుకోండి…
సాధించే వరకూ విశ్రమించకండి…
ప్రయత్నాన్ని ఆపకండి…
విజయం తప్పక వరిస్తుంది…
ఇదే యువతకు నేనిచ్చే సలహా…

నా జీవితం ప్రయాణం నిజాయితీగా మీ ముందు ఉంచాను…

ఇది చదివి ఏ ఒక్కరు స్పూర్తి పొందినా…
మీకన్నా నేనెక్కువ ఆనంద పడతాను…
అందరికీ నమస్కారం…

మరొక్క సారి…

డబ్బులు ఎవరికీ ఊరికే రావు….

అలానే

“”విజయాలు కూడా ఎవరికీ సులభం గా రావు””…

“”Planned Hard work”‘

(యువత ఇలాంటి వారి అనుభవాలను తప్పక చదవాలి!
ఇలాగే కాకున్నా … మరోలా విజయాలు సాధించవచ్చు!)

Mottobyte

Bulk SMS, Voice Calls, WhatsApp

8520986185

Scroll to Top